ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా పౌష్టికాహారం మీద జరిగిన ఒక సర్వే లో విటమిన్ల లోపాల మీద కొన్ని విషయాలు తెలిసివచ్చాయి . మధ్యతరగతి మరియు ఉన్నత మధ్యతరగతి , వున్నత తరగతి ప్రజలు అంటే అల్పాదాయ వర్గాల వారిని మినహాయిస్తే మిగిలిన వారిలో విటమిన్ల మీద అవగాహన బాగానే వుంది కాని ఇది కాస్త ఎక్కువయి హైపర్ విటమినోసిస్ కి దారితీస్తోందని తెలిసింది. ఈ మధ్య మన వాళ్ళు కూడా ముఖ్యంగా పిల్లల విషయంలో విటమిన్ మాత్రలు , విటమిన్ డ్రింక్స్ ,కంప్లన్-బూస్ట్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ ,విటమిన్ ఫుడ్స్ (ఈ మధ్య గోధుమ పిండి లో కూడా విటమిన్లు కలిపామని ప్రకటనలు), ఎక్కువగా వాడుతున్నారు . ఇవి హైపర్ విటమినోసిస్ కి దారితీసి రకరకాల సమస్యలు సృస్టిస్చున్నాయి. ఈ విటమిన్లలో కొన్ని అంటే ఏ ,డీ, ఇ, విటమిన్ లు నీటిలో కరగవు.కాబట్టి వీటిని విసర్జించే అవకాశం లేదు . ఇవి శరీరం లో పేరుకొని పోవటం వలన తలనొప్పి, అలసట, నిస్తేజం , శరీరం పొడిగా వుండటం , దురద, చదువు మీద అనాసక్తి ఇలా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి . వీటి కోసం డాక్టర్ దగ్గరకు వెళితే మళ్లి విటమిన్ టాబ్లెట్స్ !! ప్రిస్క్రిబ్ చేస్తారు . మరీ చాల ఎక్కువ స్తాయి లో సమస్యలొస్తే డాక్టర్లు హైపర్ విటమినోసిస్ గురించి ఆలోచిస్తారు. కాని ఈ సమస్యల్ని మనం ” కొని ” తెచ్చుకుంటున్నట్టు డాక్టర్ గారికి తట్టాలిగా. ఇక నీటిలో కరిగే బి కాంప్లెక్స్ ,సి విటమిన్ లు తో పెద్ద ప్రమాదమేమి లేకపోయినా , ఎందుకంటే అవి మూత్రం ద్వారా (ఎక్కువయినవి) విసర్జింప బడతాయి ,ఎక్కువ కాలం ఎక్కువ మోతాదుల్లో తీసుకొంటూ వుంటే ప్రమాదమే! కాబట్టి జాగ్రత్త !!!
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
Every thing is poision. Only dosage makes difference.