
అసలు మెరుపంటేఎంటీ? మేఘాల్లొ ఉన్న విద్యుత్ ఆవేశం (charge) ఒక చోటునుండి ఇంకొక మేఘం వైపుకో లేక భూమి(పిడుగు)వైపుకు గాలి ద్వారా ప్రయానించటాన్ని మెరుపు అంటారు. మెరుపు ఈ విధంగా ప్రయనించటానికి చాలా శక్తి కావాలి. అలా ప్రయానించేటప్పుడు గాలి లోని నత్రజని (Nitrogen) ఆంలజని(Oxygen) తోచర్య జరిపి వాన నీటి తో కలిసి యూరియా గా ఎర్పడుతాయి. ఒక్కొ మెరుపు కొన్ని టన్నుల యూరియా ను ఉత్పత్తి చేస్తుంది. ఒక మనిషి తన జీవిత కాలం లొ ఒక మెరుపంత కూడా యూరియా కూడా తయారు చెయ్యలేడు (యూరిన్ రూపం లొ). కాబట్టి ప్రకౄతి లొ మన విలువ ఒక మెరుపు కన్న తక్కువే! అంతే కాదండోయ్!చెట్లు ఆహారాన్ని (కిరనజన్యససన్యోగక్రియ photosynthasis) చెసుకోవడానికి కూడా అంతే ఉపయోగ పడతాయి. ఇంకో విషయమేమిటంటే మెరుపులు ఉరుములుగా మార్చి నుండి జూన్ వరకు ఎక్కువగా భూమి వైపు వస్తాయి.కాబట్టి మిగతా నెలల్లో ధైర్యంగా ఉండడి మన మీద పిడుగు పడటానికి అవకాశాలు తక్కువ!

ఆభరణాలలో అతి కరీదైన రాయి వజ్రం. అంతేకాదండి వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం. అంత పదునైనది మరి!
ఇవి ఏలా వస్తాయి.
ఏ రంగూ లేని వజ్రం లో పూర్తిగా కార్బన్ మాత్రమే ఉంటుంది. వేరే పదార్థం ఏదైనా కలిస్తేనే దానికి వేర్వేరు రంగులు వస్తాయి.
కింబర్లైట్ అనే రాయిలో చాలా శాతం కార్బన్ ఉంటుంది. ఇది దాదాపు భూమి ఉపరితలం నుంటి 150 కీ.మీ లోతులో ఉంటుంది. ఆ ఒత్తిడికీ మరియూ వేదికీ ఈ రాయి వజ్రం లాగా మారుతుంది. అగ్ని పర్వతాల ద్వారా లేదా మట్టి క్రమంగా పైకి రావటం ద్వారనో ఈ వజ్రాలు కూడా పైకి వస్తాయి.
వజ్రం తయారవటానికి కావలసిన ఉష్నోగ్రత, 1500 డిగ్రీల సెల్సియస్. ఒత్తిడి 70 వేళ అట్మాస్ఫియర్లు.
మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదో ఒక రూపంలో పెట్రోలు లేదా డిజిల్ ను వాడుతాం. వంట చేయాలంటే గ్యాస్ కావాలి.
ఇవి ఎక్కన్నుంచి వస్తాయి?
కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చిన్న చిన్న మొక్కలు మరియూ చెట్లు సముద్రం అడుగున సూక్ష్మ జీవుల తో పాటుగా బురదలో కూరుకు పోయాయి. ఇవి అపారమైన ఉష్నోగ్రత మరియూ ఒత్తిడికి లోనయ్యాయి, ఈ సంధర్భంలో ఆ క్రిములు చేసిన రసాయనిక చర్యల వల్ల ఇందనం ఏర్పడింది.
దీనిని వెలికి తీసిన తరువాత, పెట్రోలు డిజలు మరియూ మరెన్నో రకాలైన ఇందనాలను కర్మాగారాల్లో వేరు చేస్తారు.
ఈ పదం వినని వారు మన రాష్ట్రం లో ఉండరు.
సాధారణంగా వచ్చే అలలు వేగమైన సముద్రపు గాలుల వళ్ళ సృష్టించబడుతాయి.
కానీ సునామీలు మాత్రం సముద్రపు అడుగు కదలినపుడు మాత్రమే వస్తాయి. ఇలా జరగటానికి భూకంపం ఐనా రావాలి లేదా సముద్రపు అడుగులో అగ్ని పర్వతమైనా పేలాలి.
అలా జరిగన ప్రదేశం నుంటీ అన్ని వైపులా ఈ సునామీ వస్తుంది. ఎలాగైతే నీటిలో రాయి విసిరినప్పుడు అలలు వస్తాయో అలాగన్న మాట.
వీటి ఎత్తు కొన్ని సందర్బాలలో 100 అడుగులు కూడా ఉండే అవకాశం ఉంది. వీటి వల్ల ఓడలకి ప్రమాదం ఎమీ ఉండదు. ఎందుకంటే అవి ఉన్న ప్రదేశం లో, సముద్రం 100 అడుగులకంటే లోతు ఉంటుంది. అందుకే ఈ సునామీ, నీటి మట్టం కంటే క్రిందనుంటి వెళ్ళిపోతుంది. కానీ దీని నిజ స్వరూపం వొడ్డుకు వచ్చేదాకా తెలియదు.
గంటకు 300 మైళ్ళ వేగం తో కనీసం 20 అడుగుల ఎత్తు మరియూ దాదాపు ఒక కిలో మీటరు పొడవున్న నీటి గోడ తాకితే ఆ పరిస్తితి ఎంత విషమంగా ఉంటుందో ఊహించండి. ఇలా ఒక్క అల వచ్చి ఆగిపోదు. వెంట వెంటనే 5 లేదా 6 అలలు వస్తాయి.